AP: కొత్తగూండెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం సహకరించాలని ఎంపీ రఘురాం రెడ్డి కోరారు. మూసీ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు, కేటీపీఎస్ విస్తరణకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కలిపిన వాటిలో 4 గ్రామ పంచాయతీలను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ 4 గ్రామ పంచాయతీలు ఏపీ, తెలంగాణలో ఎక్కడా ఉనికిలో లేవన్నారు.