NRML: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక గ్రామ సభలను అందరూ విజయవంతం చేయాలని స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.