బీబీసీ తీసిన వివాదాస్పద డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా UK లోని వందలాది మంది ప్రవాస భారతీయులు తమ గళం విప్పారు. ఆదివారం సెంట్రల్ లండన్లోని BBC ఆఫీస్ ఎదుట వారు ప్రదర్శన నిర్వహించారు. బీబీసీని బహిష్కరించి బ్రిటీస్ బయాస్ కార్పొరేషన్, హిందూ ఫోబిక్ కధన్ని ఆపండి…షేమ్ బీబీసీ, భారత మాతకు జై అంటు నినాదాలు కూడిన ప్లకార్డులను నిరుసనకారులు ప్రదర్మించారు. ప్రధాని నరేంద్ర మోడీ పై రూపొందించిన డాక్యుమెంటరీ అత్యంత పక్షపాతంతో కూడుకున్నదని ఎఫ్ఐఎస్ఐ యుకెకు చెందిన జయూ షా అన్నారు.బ్రాడ్కాస్టర్గా తమ విధి నిర్వహణలో విఫలమైనందుకు బీబీసీ డైరెక్టర్ల బోర్డును విచారించాలని అన్నారు. తన తల్లి శారీరక వైకల్యంతో వీల్ఛైర్ను ఉపయోగిస్తుంటుందని..
అయినప్పటికీ ఆమె.. బీబీసీ చూపిస్తున్న వివక్షతపై తన గళం విప్పుతూ.. నిరసన తెలియజేయడానికి వచ్చారని అన్నారు. BBC చూపిస్తున్న వివక్షత.. భారత వ్యతిరేక ప్రచారానికి వ్యతిరేకంగా అందరం స్వరం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. యుకెకు చెందిన బీబీసీ ప్రధాన పై పీఎం క్వశ్చన్ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. రెండు భాగాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమైంది. ఇందులో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశోధించాలని పేర్కొంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. పూర్తిగా మోడీ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.