• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సిరికొండ-కమ్మార్‌పల్లి అటవీ ప్రాంతాల్లో పులి కదలికలు

NZB: జిల్లా సిరికొండ మండలం కమ్మార్‌పల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా (నిజామాబాద్), ఆర్మూర్ అటవీ విభాగాధికారి బీ. భవాని శంకర్, సిరికొండ ఎఫ్.ఆర్.వో నర్సింగరావు, శక్తి గంగారం, క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టారు.

February 25, 2026 / 08:05 PM IST

రేపు కోదాడకు రానున్న కేటీఆర్

SRPT: లాకప్ డెత్‌లో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు (గురువారం) మధ్యాహ్నం 2:00 గంటలకు కోదాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మధ్యాహ్నం లోపు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసానికి చేరుకోవాలని కార్యాలయం ఇవ్వాళ ఒక ప్రకటనలో కోరింది.

February 25, 2026 / 08:04 PM IST

చికిత్స పొందుతూ.. వ్యక్తి మృతి

NLG: ఈ నెల 17న చిట్యాల మండలం, గుండ్రాంపల్లి శివారులో బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. శేఖర్ (34) ఫిబ్రవరి 17న కూలి పని కోసం భైరవునిబండ నుంచి మిత్రుడితో చౌటుప్పల్‌కు వెళుతుండగా గుండ్రాంపల్లి వద్ద బైకు అదుపుతప్పి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

February 25, 2026 / 08:03 PM IST

అంబులెన్స్‌ పైలెట్లకు ‘స్టార్ పైలెట్’ పురస్కారం

ASF: జిల్లాలోని లింగాపూర్, సిర్పూర్ (యు), జైనూర్ మండల కేంద్రాల్లో 108, 102 అంబులెన్స్‌ పైలెట్లు జగదీష్, జ్ఞానేశ్వర్, రవి, గజానంద్‌లకు ‘స్టార్ పైలెట్’ పురస్కారం లభించింది. బుధవారం ఈ అవార్డులను జిల్లా కలెక్టర్ కె. హరిత,DMHO సీతారాం చేతుల మీదుగా అందుకున్నారు. అత్యవసర సేవల్లో వీరి సేవలను గుర్తించి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.

February 25, 2026 / 08:03 PM IST

‘ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం’

KMR: శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని కామారెడ్డి ASP చైతన్య రెడ్డి అన్నారు. పల్వంచ మండలం ఫరీద్‌పేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తక్కువ సమయంలో స్పందించి కెమెరాలు ఏర్పాటు చేయించిన సర్పంచ్ నర్సింహారెడ్డి దంపతులను పాలకవర్గాన్ని ఆమె అభినందించారు. ఎస్సై అనిల్‌, బట్టెంకి బాలరాజు ఉన్నారు.

February 25, 2026 / 08:02 PM IST

ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

BHNG: భయాందోళనలో చెందకుండా, ఇంటర్మీడియట్ విద్యార్థులు, సకాలంలో హాజరై పరీక్షలు రాయాలని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష నిర్వహణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు.

February 25, 2026 / 08:02 PM IST

స్వచ్ఛ సర్వేక్షన్‌-2026 లక్ష్యంగా పనిచేయాలి: మేయర్‌

KNR: కరీంనగర్‌ నగర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, స్వచ్ఛ సర్వేక్షన్‌-2026లో ఉత్తమ ర్యాంకు సాధించాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వార్డులో వంద శాతం చెత్త సేకరణ జరగాలన్నారు.

February 25, 2026 / 08:01 PM IST

చారిత్రక వారసత్వం..శ్రీరంగాపురం ఆలయ విశిష్టత

WNP: వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మితమైన శ్రీరంగపూర్ శ్రీరంగనాథస్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. శ్రీరంగం తమిళనాడు వెళ్లలేని భక్తుల కోసం వనపర్తి రాజులు ఇక్కడ రంగనాథస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గర్భాలయంలో స్వామివారు శేషతల్పంపై పవళించిన భంగిమలో దర్శనమిస్తారు. విజయనగర శిల్పకళా రీతిలో నిర్మించిన ఈ ఆలయం, సంస్థానాధీశుల భక్తికి నిదర్శనం.

February 25, 2026 / 08:01 PM IST

‘ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయవద్దు’

ADB: ప్రజలు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయాల్సిన అవసర లేదని, ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్ అన్నారు. బుధవారం గాదిగూడ మండలంలోని ఝరి PHCలో ఉచిత మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. వైద్యులు రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.

February 25, 2026 / 08:00 PM IST

రైతు భరోసా విడుదలకు వినతి

NRPT: పంటలు వేసి రెండు నెలలు గడిచినా రైతు భరోసా నిధులు విడుదల కాలేదని సీపీఐఎం కార్యదర్శి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల ఆలస్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తపల్లి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

February 25, 2026 / 07:56 PM IST

బైక్‌ను ఢీ కొట్టిన ట్రాక్టర్.. మహిళ మృతి

MNCL: రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ నుంచి విఠల్ నగర్ వెళ్లే దారిలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ట్రాక్టర్, బైక్‌ని ఢీ కొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు మందమర్రి పట్టణం 2వ జోన్ కు చెందిన చంటి మల్లీశ్వరిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

February 25, 2026 / 07:55 PM IST

దావత్ -ఈ -ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు

HYD: కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని టోలీచౌకి సాలార్ బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన దావత్ -ఈ -ఇఫ్తార్ విందులో AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, MLA కౌసర్ మొహియుద్దీన్ పాల్గొన్నారు. ముందుగా మత పెద్దలతో కలిసి ప్రతేక్య ప్రార్థనలు (దువా) నిర్వహించారు. AIMIM పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

February 25, 2026 / 07:55 PM IST

అయిజ బస్టాండ్‌లో అధికారుల తనిఖీ

GDWL: అయిజ బస్టాండ్ పరిసరాలను రీజినల్ మేనేజర్ సంతోష్, గద్వాల డిపో మేనేజర్ సునీత పరిశీలించారు. శుభ్రత, డ్రైనేజీ, బస్సుల రాకపోకల నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలపై సమీక్షించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

February 25, 2026 / 07:51 PM IST

భూసేకరణ వేగవంతం చేయండి: కమిషనర్

RR: AOC కారిడార్ రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా ఆర్కేపురం ఆర్ఓబి నుంచి ఎల్బీనగర్ జోన్ TKR కమాండ్ వరకు, అక్కడి నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు చేపట్టనున్న నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.

February 25, 2026 / 07:50 PM IST

ప్రశాంతంగా ముగిసిన తొలిరోజు ఇంటర్ పరీక్షలు

VKB: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు మొత్తం 272 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. ​మొత్తం విద్యార్థులు 8,672 మందిలో 8,400 మంది హాజరయ్యారు. ​ఈరోజు పరీక్ష ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు.

February 25, 2026 / 07:50 PM IST