WNP: మదనాపురం మండలంలోని జడ్పీ హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. విజ్ఞానం పుస్తకాలకే పరిమితం కాదని చాటుతూ కళాకారుడు విద్యార్థుల ముందే కుమ్మరి చక్రంపై మట్టి పాత్రలు తయారు చేసి చూపించారు. మట్టిని కుండలుగా మార్చే విధానం విద్యార్థులను ఆకట్టుకుంది. సైన్స్ మన దైనందిన జీవితంలో భాగమని హెచ్ఎం మహేందర్ గౌడ్ తెలిపారు.
NLG: చిట్యాల మండలం ఏపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మహేష్ సైన్స్ ప్రదర్శనలను ప్రారంభించారు. విద్యార్థులు న్యూటన్ నియమాలు, పాస్కల్ సూత్రం, గ్రీన్ ఎనర్జీ వంటి పలు వర్కింగ్ మోడల్స్ను ప్రదర్శించారు. సీవీ రామన్ సేవలను హెచ్ఎం మోహన్ రెడ్డి, ఫిజికల్ సైన్స్ టీచర్ గోపాల్ రెడ్డి కొనియాడారు.
KMR: జుక్కల్ మండలం పెద్ద ఏడ్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేసి, వంటల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, మెనూ ప్రకారం వారంలో మూడు రోజులు తప్పనిసరిగా గుడ్లు పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
ADB: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఉచిత రెసిడెన్షియల్ పరీక్ష మార్చి 1న నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్ శనివారం తెలిపారు. పట్టణంలో నలంద కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు.
సంగారెడ్డి: పోలీస్ స్టేషన్లో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదు దారుడికి భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. శనివారం SP ఆఫీస్లో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, నేరాలు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు.
WGL: వరంగల్ లోని మామునూరు విమానాశ్రయ రన్వే పొడవు 2.5 కి.మీ.కి కుదించడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో పెద్ద విమానాలు, అంతర్జాతీయ విమానాలు దిగడానికి వీలు కాదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బేగంపేట 3.2 కి.మీ., శంషాబాద్ 4.2 కి.మీ., విజయవాడ 3.36 కి.మీ. రన్వేలతో ఉండగా, వరంగల్ను 2.5 కి.మీ.కి పరిమితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
JN: పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో రేపు డాక్టర్ ఏలే శిరీష్మ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ మాచర్ల స్వరూప తెలిపారు. ఈ శిబిరంలో వివిధ రకాల వ్యాధులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VKB: కొడంగల్-తాండూర్ రూట్లో చేపడుతున్న హైవేపై మధ్యలో చేపడుతున్న డివైడర్ నిర్మాణాల్లో కనీసం యూ-టర్న్లు ఏర్పాటు చేయకపోవడంపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రూట్లో KADA ఆఫీస్, మర్కెట్ యార్డ్, సబ్స్టేషన్ ఉన్నాయని చెబుతున్నారు. గమ్య స్థానాలకు చేరుకోవడానికి కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు.
BHPL: జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MLA గండ్ర, కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా జాతికి విద్యా-విజ్ఞాన దిశానిర్దేశం చేసిన మహనీయుడని కలెక్టర్ రాహుల్ శర్మ కొనియాడారు.
గద్వాల: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రయోగాలను ఆసక్తిగా పరిశీలించి వివరాలు అడిగారు. కలెక్టర్ విద్యార్థులను లక్ష్యం నిర్దేశించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని ప్రేరేపించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ASF: బెజ్జూర్లో తపాళా శాఖ సేవలపై అవగాహన కల్పించే బ్రోచర్లను సర్పంచ్ సరోజనతో కలిసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నితిన్ శనివారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఉత్తరాల పంపిణీతో పాటు స్పీడ్ పోస్ట్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, సుకన్య సమృద్ధి యోజన, పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్సిబిషన్ వేడుకలను మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ రమ-నాగేశ్వర్ రావు శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలు తయారుచేసిన వివిధ ప్రయోగాలను వీక్షించి అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీ 8వ వార్డులో మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ ఛైర్ పర్సన్ శ్రీలక్ష్మి సైదులు, శనివారం కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. వార్డులోని సమస్యలను ఆ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ వివరించగా.. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఎర్పుల పరమేష్, సందీప రాంరెడ్డి పాల్గొన్నారు.
HNK: ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల కంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఎస్సీ కాలనీలో మహిళా సంఘం భవన నిర్మాణ పనులకు ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
BDK: భద్రాచలం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఆదివారం పర్యటించనున్నారు. చర్లలో ఆసుపత్రి శంకుస్థాపనతో పాటు, పలు మండలాల్లో సర్పంచుల సన్మానం కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం భద్రాచలంలో నవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక అభివృద్ధి పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం.