సంగారెడ్డి: పోలీస్ స్టేషన్లో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదు దారుడికి భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. శనివారం SP ఆఫీస్లో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, నేరాలు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు.