• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అంగన్వాడీలో గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం

NZB: ధర్పల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం ‘అంగన్వాడీ పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 3-6 ఏళ్ల చిన్నారులకు ప్రీ-స్కూల్ శిక్షణ, పోషకాహారం, ఆరోగ్యలక్ష్మి పరీక్షలపై అవగాహన కల్పించారు. గ్రాడ్యుయేషన్ డే, ర్యాలీల ద్వారా పిల్లలను పాఠశాలలకు సిద్ధం చేసే అంశంపై తల్లిదండ్రులకు వివరించారు.

February 28, 2026 / 04:24 PM IST

‘సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేది పోలీసులే’

MNCL: తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను శనివారం ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.

February 28, 2026 / 04:22 PM IST

కరీంనగర్ నుంచి గోవా టూర్ ప్యాకేజీ ఏర్పాటు

KNR-2 డిపో గోవా టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు డి ఎ. శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో ఉడిపి, ముఖంబికా అమ్మవారి దర్శనం, మృడేశ్వర్, గోకర్ణ టెంపుల్స్ దర్శనం, గోవా బీచ్‌లో ముఖ్య ప్రదేశాలు ఉన్నాయన్నారు. మార్చి 6న సా.4 గం.కు కరీంనగర్ నుంచి బయలుదేరి తిరిగి మార్చి 10న కరీంనగర్ చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.4,150 నిర్ణయించామన్నారు.

February 28, 2026 / 04:22 PM IST

అదుపుతప్పి ట్రాలీ బోల్తా.. డ్రైవర్కు గాయాలు

MHBD: మరిపెడ పట్టణ కేంద్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మరిపెడ నుంచి MHBD జిల్లాకు వెళ్తున్న ఓ ట్రాలీ అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన వాహనాదారులు గాయపడిన డ్రైవర్ను ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 28, 2026 / 04:21 PM IST

దేవరుప్పులలో పౌరహక్కుల దినోత్సవం

JN: దేవరుప్పులలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్, RI రాజు హాజరై మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి పౌరుడు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో ప్రతి వ్యక్తి ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

February 28, 2026 / 04:20 PM IST

ఇద్దరు సీఐల పై వేటుకు రంగం సిద్ధం?

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల పై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సివిల్ తగాదాల్లో తలదూర్చి భారీగా డబ్బులు తీసుకున్నట్టు ఫిర్యాదులు అందడంతో వారిపై విచారణ జరిగినట్లు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ ఇద్దరి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.

February 28, 2026 / 04:18 PM IST

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రాసేనా రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన వీవీఐపీ అతిథి గృహం నుంచి ప్రధానాలయంలోకి వెళ్లారు. ఆలయ ముఖ మండపం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు.

February 28, 2026 / 04:18 PM IST

అన్ని శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలి: కలెక్టర్

BHPL: జిల్లాను ఆకాంక్షిత స్థితి నుంచి ఆదర్శప్రాయ స్థితికి తీసుకెళ్లేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఇవాళ ఐడీవోసీలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ 2.0 సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నీతి ఆయోగ్ నిర్దేశించిన విద్య, వైద్య, సంక్షేమ, వ్యవసాయ అంశాల్లో 100% పురోగతి సాధించాలన్నారు.

February 28, 2026 / 04:17 PM IST

ఉమామహేశ్వర దేవాలయం మూసివేత

NGKL: మార్చి 3వ తేదీన మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మండల పరిధిలోని శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన ఉమామహేశ్వర దేవాలయం మూసివేయడం జరుగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ మాధవరెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీనివాస రావులు శనివారం వెల్లడించారు. భక్తులు యాత్రికులు ఈ విషయాన్ని గమనించాలని సహకరించాలని కోరారు. 4వ తేదీ నుంచి యథావిధిగా ఆలయంలో దర్శనం ఉంటుందన్నారు.

February 28, 2026 / 04:17 PM IST

వంగూరు వాసికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్

NGKL: వంగూరు మండలం డిండిచింతపల్లికి చెందిన సుగురిబాబు కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ విద్యుత్ ఆధారిత వ్యవస్థలపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్ మల్లేశం ఆధ్వర్యంలో పీహెచ్డీ పరిశోధనలు పూర్తి చేశానని అన్నారు. అనంతరం ఈరోజు డాక్టరేట్ స్వీకరించారు.

February 28, 2026 / 04:16 PM IST

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారు: ఎస్పీ

మహబూబ్‌నగర్: జిల్లాలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ వెంకయ్యకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి. జానకి శాలువా కప్పి సత్కరించి అభినందించారు. 34 ఏళ్ల సేవలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని ఎస్పీ కొనియాడారు.

February 28, 2026 / 04:14 PM IST

కాజీపేట ప్రాంతానికి చేసింది శూన్యం: MLA

HNK: BRS హయాంలో కాజీపేట ప్రాంతానికి చేసింది శూన్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీనియర్ శాసన సభ్యునిగా ఉన్న హరీశ్ రావు కూడా దుష్ప్రచారాలు చేయడం సబబు కాదని, కాజీపేటకు 30 పడకల దవాఖానా ఆవశ్యకత ఉన్నప్పటికీ కనీసం ప్రయత్నాలు చేయని దద్దమ్మలు మీరు అని, BRS నేతల మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.

February 28, 2026 / 04:14 PM IST

ఘనంగా సైన్స్ దినోత్సవం

JGL: పెగడపల్లి మండలంలోని నామాపూర్ గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్‌లో సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ ఆధారంగా పలు పరికరాలను తయారు చేసి ప్రదర్శించారు. అలాగే పలు చిత్రపటాలను గీసి, వాటి ఉపయోగంపై విద్యార్థులు వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఎంఈవో సులోచన పాల్గొని విద్యార్థులు ప్రవేశించిన పరికరాలను పరిశీలించారు.

February 28, 2026 / 04:07 PM IST

సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు

MNCL: మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పలు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ఏరియా సింగరేణి పర్సనల్ HOD రాజేశ్వర్ రావు శనివారం తెలిపారు. మార్చ్ 5న మాదారం, 6న గోలేటిలో సాయంత్రం 4 గంటల నుండి పోటీలు జరుగుతాయన్నారు. వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న మహిళలు GM ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు.

February 28, 2026 / 04:06 PM IST

‘ఆసక్తి కలిగించే విధంగా బోధన అందించాలి’

ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎర్రగుంట గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ శనివారం సందరర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలోని బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆసక్తి కలిగించే విధంగా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

February 28, 2026 / 04:04 PM IST