• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం

MLG: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సన్నహాలు పూర్తి చేసినట్లు జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి హుస్సేని ఇవాళ తెలిపారు. జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా, 176 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా, 46 లక్షల గన్నీ బ్యాగుల కోసం 30.39 లక్షల బ్యాగులు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

October 14, 2025 / 07:01 PM IST

అండర్ పాస్, సబ్ వే నిర్మాణం చేపట్టాలని వినతి

MBNR: సికింద్రాబాద్ రైల్వే నిలయంలో రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్‌ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కలిశారు. నియోజకవర్గ కేంద్రంలో అండర్ పాస్, సబ్ వే నిర్మాణానికి సంబంధించి వర్క్ శాంక్షన్స్ ఇవ్వాలని, మదనపురం రైల్వే గేట్ వద్ద వాహనాలు పెరిగి, అధిక రద్దీ కారణంగా అండర్ పాస్ లేదా ROB నిర్మించాలని వినతిపత్రం అందజేశారు.

October 14, 2025 / 07:00 PM IST

హర్షవర్థన్‌కు జాతీయ స్థాయి బెల్ట్ డిప్లోమా

JGL: హైదరాబాద్‌లోని నాగబాబు స్టూడియోలో మంగళవారం జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు రాపోలు సుదర్శన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ, జాతీయ బ్లాక్ బెల్ట్ అవార్డు కార్యక్రమం జరిగింది. సినీ నటుడు సుమన్ జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నంకు చెందిన రాగి హర్షవర్థన్‌కు జాతీయ స్థాయి బెల్ట్ డిప్లోమాను అందజేసి అభినందించారు.

October 14, 2025 / 06:59 PM IST

ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఆరు గొర్రెలు మృతి

SRPT: తిరుమలగిరి మండలం తొండలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఆరు గొర్రెలు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని గ్రామ ప్రజలు తెలిపారు. గొర్రెల యజమానికి వెంటనే ఇసుక ట్రాక్టర్ యజమాని నష్టపరిహారం చెల్లించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 14, 2025 / 06:58 PM IST

HIT TV ఎఫెక్ట్.. రోడ్డుపై గార్బేజ్ క్లియర్..!

HYD: కూకట్ పల్లి పరిధి అల్లాపూర్ పర్వత్ నగర్ ప్రాంతంలో రోడ్డుపై డ్రైనేజీ పొంగిపొర్లటంతో పాటు, గార్బేజ్ పేరుకపోయిందని ఇవాళ ఉదయం HIT TV ఓ కథనాన్ని రాసుకొచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు, రోడ్డుపై ఉన్న చెత్త క్లియర్ చేయడంతో పాటు, డ్రైనేజీ సమస్యను జలమండలి అధికారులకు తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

October 14, 2025 / 06:56 PM IST

‘SC, ST లపై జరుగుతున్న దాడులను నివారించాలి’

ADB: ఎస్సీ, ఎస్టీలపై దాడులను పర్యవేక్షించే విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం పట్టణంలో మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. SC, STలపై జరుగుతున్న దాడులను నివారించాలన్నారు. దాడుల నివారణ, బాధితులకు న్యాయం చేసేందుకే జిల్లా విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. MLA పాయల్ శంకర్, SP అఖిల్ మహాజన్ తదితరులున్నారు.

October 14, 2025 / 06:55 PM IST

‘క్రీడలతో స్నేహ బంధాలు పెరుగుతాయి’

NRPT: మరికల్ మండల కేంద్రంలో ఇవాళ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, కోకో, కబడ్డీ పోటీల విజేతలకు బహుమతులను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి అందజేశారు. బాల బాలికలకు వేరువేరుగా మొదటి బహుమతి రూ. 3,116 రెండవ బహుమతి రూ.2,116 అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కరీముల్లా, హెచ్ఎం నాగరత్నమ్మ, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

October 14, 2025 / 06:54 PM IST

ఆర్టీసీ డిపోకు కొత్త మేనేజర్ రవికుమార్ బాధ్యతలు

KMR: జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోకు నూతన డిపో మేనేజర్‌‌గా రవికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేశారు. మునుపటి డిపో మేనేజర్ సరితా దేవి హకీంపేట్ డిపోకు బదిలీపై వెళ్లగా, జీడిమెట్ల డిపో నుంచి ప్రమోషన్‌పై రవికుమార్ బాన్సువాడ డిపో బాధ్యతలు చేపట్టారు.

October 14, 2025 / 06:52 PM IST

‘విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు’

వనపర్తి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యాజమాన్యాలు ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సమస్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.

October 14, 2025 / 06:52 PM IST

వీడియో కాన్ఫిడెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

KNR: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మంగళవారం HYD నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.

October 14, 2025 / 06:47 PM IST

రాష్ట్రస్థాయి పోటీలకు ఆలూరు ZPHS విద్యార్థి

NZB: ఆలూరు ZPHS పాఠశాలకు చెందిన విద్యార్థి శ్రీనిత్ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక అయినట్లు ఫిజికల్ డైరెక్టర్ రాజేష్ తెలిపారు. క్రీడాకారుడిని HM & MEO నరేందర్ అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.

October 14, 2025 / 06:45 PM IST

వైద్య శిబిరంలో 200 మందికి కంటి పరీక్షలు

KMM: సత్తుపల్లి మండలం రేజర్లలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని సామాజిక సేవకులు రమేష్, ప్రభాకర్ ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో మొత్తం 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 25 మందికి కంటి ఆపరేషన్ చేసేందుకు గుర్తించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మురళీకృష్ణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

October 14, 2025 / 06:44 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష ఎంపికపై ముఖ్య కార్యకర్తల సమావేశం

KNR: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎంపిక నేపథ్యంలో గంగాధరలోని ఓ గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు మానే శ్రీనివాస్ హాజరై పరిశీలించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సత్తు మల్లేశం, ఆత్రం సుగుణ తదితర నాయకులు పాల్గొన్నారు.

October 14, 2025 / 06:43 PM IST

పాఠశాలకు స్మార్ట్ టీవీ, కంప్యూటర్ బహుకరణ

SDPT: జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ, కంప్యూటర్, విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ బహూకరించారు. జగదేవ్‌పూర్ మండల యూటీఎఫ్ అధ్యక్షులు తలారి శ్రీనివాస్, ముత్యాల వేణుగోపాల్, యాదగిరిలు అందజేశారు. ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అయితేనే విద్యావ్యవస్థకు పునాదులు గట్టిగా ఉంటాయని పేర్కొన్నారు.

October 14, 2025 / 06:39 PM IST

PHC ని తనిఖీ చేసిన DMHO

MHBD: కురవి మండలం బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO డా. బి.రవిరాథోడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవల తీరును పరిశీలించారు. ముందుగా అవుట్ పేషెంట్ విభాగాన్ని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న సేవల గురించి, సదుపాయాల గురించి ఆరాతీశారు.

October 14, 2025 / 06:37 PM IST