NGKL: జిల్లా పర్యటనలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రసిద్ధ మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని సందర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవితో కలిసి ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.
GDWL: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రేపు గద్వాల పర్యటనకు రానున్నారు. పట్టణంలోని వాల్మీకి భవనంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జె. వెంకటేశ్ కూడా హాజరవుతారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఈ సమావేశానికి భారీగా తరలిరావాలని జిల్లా కార్యదర్శి కె. వెంకటస్వామి పిలుపునిచ్చారు.
GDWL: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రేపు గద్వాల పర్యటనకు రానున్నారు. పట్టణంలోని వాల్మీకి భవనంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జె. వెంకటేశ్ కూడా హాజరవుతారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఈ సమావేశానికి భారీగా తరలిరావాలని జిల్లా కార్యదర్శి కె. వెంకటస్వామి పిలుపునిచ్చారు.
NLG: కట్టంగూర్లోని సాందీపని పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రంలో టెన్త్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో పున్నంరాజు సుధాకర్- సౌమ్య దంపతుల సహకారంతో 250 మజ్జిగ ప్యాకెట్లను మంగళవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్త వహించాలన్నారు.
MNCL: జన్నారం మండలం పొనకల్ పట్టణ ప్రాంతంలో ప్రతి మంగళవారం వారసంతా ఉన్న నేపద్యం లో మండలం నుండి చాలా మంది ప్రజలు మండల కేంద్రానికి రావడం జరుగుతుంది. ఎండలు ఎక్కువగా ఉన్న నేపద్యం లో ప్రతి మంగళవారం పూర్ణచందర్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వేసవి నుండి ప్రజలకు కొంత ఊరట లభించే ఉదేశ్యంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.
WGL: సంగెం మండలం ఆశాలపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. పనుల పురోగతిని వివరంగా తెలుసుకుని, నాణ్యతను కాపాడుతూ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
KMM: రైతులకు న్యాయమైన ధరలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మత్కేపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు అన్నారు. చింతకాని మండలం లచ్చగూడెంలో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు మంగళవారం తెలిపారు. రైతుల వద్ద నుంచి సేకరించిన మక్కలను గోనెసంచులలో నింపి లారీల ద్వారా ఎగుమతికి సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
BDK: బూర్గంపాడు మండలం సారపాకలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కిషోర్ శివరామ్ నాయక్ ఆధ్వర్యంలో పెండింగ్ పట్టాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ముత్యాలమ్మపేటకు చెందిన వెంకటేశ్వర్లుకు ఇళ్ల పట్టా అందజేశారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
BHPL: చిట్యాల MRO కార్యాలయంలో మంగళవారం MROకు VCK అనుబంధ సంఘం LLF రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, VCK యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చల్లగరిగెలో సర్వే నంబర్ 274/52/1 & 274/53లోని 3 ఎకరాల 14 గుంటల అసైన్డ్ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి చెట్లు పెట్టిన బండి చంద్రమౌళి కుమారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
SRCL: ఎండాకాలం సెలవులలో విద్యార్థులు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పడాలని సిరిసిల్ల జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి కవిత అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పిల్లల దత్తత, రక్షణ చట్టాలు, అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు.
PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జూలపల్లి మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తేలుకుంట కేజీబీవీ, పెద్దాపూర్ మోడల్ స్కూల్, జూలపల్లి తహసిల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. రోగులకు సరియైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
HYD: స్కూటీపై నలుగురు ప్రయాణిస్తూ ఓ చేతులో మందు సీసా, మరో చేతిలో సిగరెట్ తాగుతూ.. తూలుతూ వెళ్లేంత స్వేచ్ఛ వీరికి ఎవరిచ్చారు. నగర శివారు హయత్నగర్ & డీడ్ స్కూల్ వద్ద సోమవారం రాత్రి యువకులు ఇలా వీరంగం చేస్తూ కనపడ్డారు. వీరితో పాటు తోటి ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదంగా ప్రయాణిస్తూ హల్చల్ చేశారు. ఇలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
JGL: కోరుట్ల మండలంలో మొక్కజొన్న రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పన్నాల అంజిరెడ్డి మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతులు పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే వారికి ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
ASF: కౌటాల మండలం ఖనికి గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె పకృతి వనంలో ఉన్న నీలగిరి చెట్లను అమ్ముకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఖనికి గ్రామస్థులు MPDO కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పంచాయితీలో తీర్మానం లేకుండా సుమారు రూ.3 లక్షల విలువగల చెట్లను అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
NLG: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా కవర్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు.