RR: కొండాపూర్ ఆసుపత్రిలో రూ. 40.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 100 పడకల నూతన క్రిటికల్ కేర్ విభాగం భవన నిర్మాణానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలోని సేవలను పరిశీలించి, నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని పేదలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
JN: బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన బొడ్డు బాల్ నర్సయ్య (46) అనారోగ్యంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. 4 ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతున్నా ఫలితం లేక మనస్తాపానికి గురయ్యాడు. ఇవాళ ఉదయం ఇంట్లో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
MDK: రామాయంపేట మండల నూతన వ్యవసాయ అధికారి(AO)గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ బదిలీల్లో భాగంగా ఆయన నిర్మల్ జిల్లా నుంచి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వనని మాట ఇచ్చారు.
BHNG: ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణంతో గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని బీబీనగర్ మండలం గూడూరు గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్ అన్నారు. గురువారం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ రోడ్లు, ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
PDPL: కానిస్టేబుల్, ఎస్సై, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న జిల్లా అభ్యర్థులకు ఈ నెల 12న GDK జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. ఇవాళ కలెక్టరేట్లో పోస్టర్ ఆవిష్కరించారు.అభ్యర్థులు ఈనెల 10లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్లో బహుమతులు ఇవ్వబడతాయని తెలిపారు.
RR: కొత్తూరు మండలం తిమ్మాపూర్లో అత్యవసర రక్షణ చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. SHO నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు భయపడకుండా వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తక్షణమే ఎలా స్పందించాలని అవగాహన కల్పించారు.
MNCL: బెల్లంపల్లి మండలం పెద్దబూదలో పొలం పనులకు వెళ్లిన రేణుక గురువారం పాముకాటుకు గురైంది. స్థానికుల వివరాల ప్రకారం రేణుక పొలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురైందన్నారు. వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
SRPT: రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా డివిజన్ కార్యాలయం ముందు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరసన రెండో రోజుకు చేరింది. గతంలో పాదయాత్రలో మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. APSEB రూల్స్ అమలు చేయాలని, విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ కల్పించాలని, మీటర్ రీడర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.
ADB: ఆదిలాబాద్ డిపోకు చెందిన అన్ని రకాల ఆర్టీసీ బస్సులు ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో సీసీటీవీ కెమెరా అమర్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సు ప్రయాణికుల భద్రత, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. బస్సుల్లో జరుగుతున్న దృశ్యాలను డీఎం కార్యాలయంలో అధికారులు ఎల్లవేళలా పరిశీలీస్తుంటారని పేర్కొన్నారు.
NZB : భీమగల్ పట్టణంలో NSUI ఆధ్వర్యంలో 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. NSUI జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్పర్సన్ బొదిరె నాగమణి స్వామి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి విభాగం బలోపేతానికి యువత కృషి చేయాలన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో NSUI 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. విద్యార్థుల గళాన్ని బలోపేతం చేయడంతో పాటు, వారి చదువులకు సహాయం అందించడం గర్వంగా ఉందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లి అంజన్న యాదవ్, బైరు ప్రసాద్ గౌడ్, గోపగోని సాయి, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ASF: కౌటల మండలం కనికి క్రాస్ రోడ్డుపై ఉన్న నీటి చేతి పంపు దెబ్బతినడంతో 3 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై కనికి గ్రామ వార్డు సభ్యుడు విజయ్ కాంత్ గురువారం MPDOకి వినతిపత్రం ఇచ్చారు. సమస్యను పరిశీలించి త్వరలోనే మరమ్మతులు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు విజయ్ కాంత్ తెలిపారు.
KNR: రైతుల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి నిరంతరం కృషి చేశారని, ఆయన ఆశయాలను సదా కొనసాగిస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న 15వ వర్ధంతి కార్యక్రమం రోజున జమ్మికుంటలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి పదివేల మందితో సభ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
SRPT: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. ఈరోజు సూర్యాపేటలో మాట్లాడుతూ.. రైతులకు భరోసా, మహిళలకు ఆర్థిక సాయం వంటివి నేటికీ నెరవేరలేదన్నారు. తెలంగాణలో హామీలు అమలు చేయకుండా కేరళలో రేవంత్రెడ్డి బోగస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేరళలో మళ్లీ వామపక్ష ప్రభుత్వమే వస్తుందని అన్నారు.
RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో మంత్రి దామోదర రాజనర్సింహ & ఎమ్మెల్యే గాంధీ పాల్గొని, బాధితులపై వివక్ష చూపకూడదని, సరైన చికిత్సతో సాధారణ జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.