తెలంగాణ అవతరణ ఉత్సవాలు దేశ, విదేశాల్లో కూడా జరుగనున్నాయి. దేశంలోని మధ్యప్రదేశ్, అస్సాంలో అధికారికంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనుండడం విశేషం. ఈ మేరకు అక్కడి అధికారులు అధికారికంగా ప్రకటించారు.
దర్గాలు, ఆలయాలు తొలగించకుండా రహదారి విస్తరణ చేస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చౌరస్తాల్లో జాతీయ నాయకుల విగ్రహాలు తొలగించాలనుకోవడం ఎంతవరకు న్యాయం?
కురిసిన వర్షానికి సెట్ కూలిపోయింది. దానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. అయితే ప్రమాదంలో చిత్ర బృందానికి ఎలాంటి గాయాలు కాలేదు. కాకపోతే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
తన కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి, సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
పార్లమెంట్ (Parliament) భవనం ఓపెనింగ్ కు రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ గాంధీభవన్లో ఆదివాసీ కాంగ్రెస్ సత్యగ్రహ దీక్షను నిర్వహించింది.
సాంఘిక చైతన్యానికి నిలువెత్తు స్ఫూర్తి సురవరం ప్రతాప్ రెడ్డి (Suravaram Prathapareddy) అని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అన్నారు.
పార్లమెంటు (Parliament) భవన ప్రారంభోత్సవం దేశ ప్రజలకు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని ఏపీ బీజేపీ నేతలు అన్నారు.
రాబోయే ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.రాగల ఐదు రోజులు తెలంగాణ (Telangana) లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు
తెలంగాణలోని వైద్య కళాశాల్లో చదువుతున్న ఎంబీబీఎస్ (MBBS), చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్ పెరగనుంది.
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ (Hyderabad) లో భారీ వర్షం ముంచెత్తుతోంది. దీంతో వాహనాలుదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నందమూరి తారక రామారావు తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని మెగాసార్ట్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
యువ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురయ్యింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆయన కారు ఓ డివైడర్ను ఢీ కొంది. దీంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి.