గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు ప్రత్యక్ష ప్రసారం
ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటెడ్(3D Printed) పద్ధతిలో ఆలయాన్ని(Temple) నిర్మిస్తున్నారు. అది కూడా ఎక్కడో కాదు మన తెలంగాణలోనే.. హైదరాబాద్(Hyderabad)కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రాటెక్(Apsuja Infratech) ఈ టెంపుల్ పనులు చేపట్టింది.
తెలంగాణ దశాబ్ది వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నేటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతోంది.
పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల(Telangana state's birth decade celebrations)ను అత్యంత వైభవోపేతంగా జరుపుకునేందుకు రాష్ట్రం సిద్ధమైంది.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.
తాను చదువుతున్న కళాశాలలోనే ఓ యువతిని ప్రేమించాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ యువకుడు కొన్నాళ్లుగా మనో వేదనతో ఉన్నాడు. ఈ సమయంలో ‘నేను ఇక కనిపించను’ అని తల్లిదండ్రులకు (Parents) చెప్పి వెళ్లిపోయాడు.
హైదరాబాద్ లో పండుగ వాతావరణం సంతరించుకుంది. వీవీఐపీల తాకిడి అధికంగా ఉండడం.. సంబరాలు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రహదారుల్లో ఆంక్షలు విధించారు.
పొట్ట ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని హోం మంత్రి మహమూద్ అలీని కోరారు మంత్రి మల్లారెడ్డి. ఓ కార్యక్రమంలో పోలీసుల బొజ్జ గురించి మాట్లాడారు.
ఏపీ, తెలంగాణల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో సర్వే జరగనుంది . ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
బాచుపల్లి అరబిందో ఫార్మా పరిశ్రమలో గ్యాస్ లీక్ అవ్వడంతో ఏడుగురు కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
వీరందరూ కలిసి తనను అవమానించడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతోపాటు భార్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండడంతో ఆవేదనకు గురయ్యాడు. తన తోడల్లుడు, వదిన వేధింపులకు గురిచేశారని.. తనను తీవ్రంగా అవమానించాడని కన్నీటి పర్యంతమయ్యాడు.
ఆయన లేకుంటే కేసీఆర్ కు కూడా బోరు కొడుతుంది కదా అని నెటిజన్లు (Netizens) కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ ఎలాగైనా చేసి తన మిత్రుడిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే ఎంతో మందిని సలహాదారులుగా నియమించుకున్నారు.. వారిలో రాహుల్ ను కూడా నియమించుకోవాలని సూచిస్తున్నారు.
వరంగల్ కాంగ్రెస్ కార్తకర్తల్లో అంతర్గత విభేదాలు చెలరేగాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం చేస్తుండగా గొడవ జరిగింది. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని మే 31వ తేదీ బుధవారం కర్రపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతేడాది మట్టితో 50 అడుగుల నిర్మాణం చేయగా.. ఈసారి ఏకంగా ఎత్తైన విగ్రహం నిర్మిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది.