తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 9 చోట్ల పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మూడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లును రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.
తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం ఉందని నమ్మి, విశ్వసించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని స్పష్టంచేశారు.
సీఎం కేసీఆర్ పోటీ చేసే రెండో స్థానం కామారెడ్డిలో 100 మంది ఫౌల్ట్రీ రైతులు పోటీ చేస్తారని తెలిసింది. ఇప్పటికే 1016 మంది లంబాడీలు కూడా నామినేషన్ వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ సోదాలు జరగుతుండటం సంచలనం రేపుతుంది. జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శాసన సభ నియోజకవర్గ నామినేషన్ స్వీకరణ నేటి నుంచి ప్రారంభమై 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
కొడంగల్ బీజేపీ అభ్యర్థిగా క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ను బరిలోకి దింపాలని బీజేపీ అనుకుంటోంది. రేవంత్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి అతనే అవుతాడని భావిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్తో సీఎం కేసీఆర్ ఇల్లు బంగారంతో నిండిపోయిందని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీతో సీపీఎం తెగ దెంపులు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేశారు. రెండు, మూడు రోజుల్లో 17 చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. ఆ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని చెబుతున్నారు.
నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించి వేయండని ప్రజలను కోరారు.
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు సైతం ప్రచారం షురూ చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాని మోడీని ప్రచారంలో వినియోగించుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో మోడీ ఈనెల 7, 11 తేదీల్లో రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
బాసర అమ్మవారి ఆలయంలోకి వరసగా పాములు వస్తున్నాయి. విషయం తెలిసి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం చేయడానికి వెళ్లే పూజారులు భయపడుతున్నారు.
హైదరాబాద్లో ఐడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ లీడర్లే టార్గెట్గా సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్, బండగ్పేట మేయర్ చిగురింత పారిజాత ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి.