సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు (Trains) ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనిపై రైల్ నిలయం సికింద్రాబాద్లోజీఎం అరుణ్కుమార్జైన్ డీఆర్ఎంలతో సమీక్ష నిర్వహించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మరోసారి మంగళ్ హాట్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ 16 మందితో మూడో జాబితా విడుదల చేసింది.కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది.
కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. పదేళ్ల వరకూ తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులు పెట్టిందని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర చేస్తోందని సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అవినీతి ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మల్కాజిగిరి కోర్టును అజారుద్దీన్ ఆశ్రయించారు. బెయిల్ ఇచ్చిన ధర్మాసనం.. విచారణకు సహకరించాలని స్పష్టంచేసింది.
వేములవాడ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై, బీజేపీ పెద్దలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సింహం లాంటి వాడని, సింగిల్ గానే వస్తాడని అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే వేములవాడను దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్- సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. కొత్తగూడెం ఒక సీటు ఇస్తామని.. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ ఇస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పగా.. కమ్యూనిస్ట్ నేతలు అంగీకరించారు.
మంత్రి గంగుల కమలాకర్పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్లో భూమి కబ్జా, ఇసుక దోపిడీ చేశారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ భూ దందాలకు పాల్పడుతున్నారని.. అసైన్డ్ భూములను కబ్జా చేశారని బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో తిరిగి దానిని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తిరిగి ల్యాండ్ చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. కీలక నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు.. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
పోలీసులు కేసీఆర్ ఎన్నికల సింబల్ అయిన అంబాసిడర్ కారును సీజ్ చేశారు. ఎంటి ఆశ్చర్యంగా ఉందా ఇది నిజం. అసలు విషయం ఏంటంటే కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా టీ-కాంగ్రెస్ రూపొందించిన గులాబీ కారు.. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న వేళ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్పై కేసు నమోదయ్యింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకే రోజులో ప్రయాణించే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది.