NGKL: క్రిస్మస్ సందర్భంగా నాగర్కర్నూల్ నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకొనే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు పరమ పవిత్రమైనదని ఆయన అన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాగుణం కలిగి ఉండాలన్నారు.
SRD: క్రిస్మస్ వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. పటాన్ చెరు డివిజన్ జెపి కాలనీ మరనాద చర్చి, శాంతినగర్ కాలనీలోని సీఎస్సై చర్చిలలో క్రిస్మస్ వేడుకలకు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు ఉన్నారు.
HYD: జనవరి ఒకటి నుంచి ప్రారంభమయ్యే ‘నుమాయిష్’కు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏటా 46 రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) నిర్వహిస్తారు. 84వ ప్రదర్శనకు ఇప్పటికే స్టాళ్ల కేటాయింపు పూర్తయ్యింది. శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
MDK: జిల్లాలో నేడు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్కు హెలికాప్టర్లో వస్తారు. అనంతరం వనదుర్గమాతను దర్శించుకుని పూజలో పాల్గొంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, 11:45కి మెదక్ చర్చికి వెళ్తారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఎస్పీ కార్యాలయం వద్ద గల హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్తారు.
WNP: పాన్గల్ మండలం మహ్మదాపూర్ గ్రామంలోని అర్హులైన 10 మందికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NRML: ఖానాపూర్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో పాస్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా బుధవారం ఆ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యేసుక్రీస్తు అందించిన శాంతి బోధనలు అందరికీ ఆచరణీయమన్నారు.
NZB: రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. గత వేసవి కాలం డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని, రాబోయే వేసవిలో పెరగబోయే డిమాండ్ అంచనా మేరకు ప్రణాళిక బద్ధంగా అంచనాలు సిద్ధం చేస్తామన్నారు. సమయానుగుణంగా తగిన మంజూరును తీసుకుంటామని తెలిపారు.
KMM: మధిర మండలం బయ్యారం చర్చిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు బోధనలు ప్రేమ, మానవత్వానికి మార్గదర్శకమని, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పండుగ వేళ ప్రతీ ఇంట ఆనందం నిండాలని ఆకాంక్షించారు.
MDK: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు స్థానిక డిపో మేనేజర్ తెలిపారు. సికింద్రాబాద్, జూబ్లీ బస్టేషన్, ఎల్లారెడ్డి, నర్సాపూర్, బాలానగర్ క్రాస్రోడ్స్ తదితర ప్రాంతాల నుంచి అదనంగా బస్సులు నడుపుతామన్నారు. ఏఏ ప్రాంతాల నుంచి ఎకువ మంది భక్తులు మెదక్ చర్చికి వస్తారో ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ బస్సులు నడుపుతామన్నారు.
MDK: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు స్థానిక డిపో మేనేజర్ తెలిపారు. సికింద్రాబాద్, జూబ్లీ బస్టేషన్, ఎల్లారెడ్డి, నర్సాపూర్, బాలానగర్ క్రాస్రోడ్స్ తదితర ప్రాంతాల నుంచి అదనంగా బస్సులు నడుపుతామన్నారు. ఏఏ ప్రాంతాల నుంచి ఎకువ మంది భక్తులు మెదక్ చర్చికి వస్తారో ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ బస్సులు నడుపుతామన్నారు.
KMM: ఈనెల 28న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని ఇల్లందు మండలం బొంబాయి తండాలో బుధవారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. సబ్ డివిజన్ కార్యదర్శి పొడుగు నరసింహారావు పాల్గొని సభ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు హర్జ్య, పాండ్యా, బిక్షం, మంగిలాల్, తేజ పాల్గొన్నారు.
HYD: OYO బుకింగ్స్ టాప్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం.. గల్లీల్లో ఉండే లాడ్జిలను సైతం అధునాతన హంగులతో తీర్చిదిద్ది, అందుబాటు ధరలకే ఇస్తున్నారు. అయితే, నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ సారి గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి మన నగరానికి టూరిస్టులు వస్తుంటారు. దీంతో హోటల్స్ ఫుల్ డిమాండ్ పెరిగింది.
JGL: హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మార్గశిర మాసం కృష్ణపక్షం ఏకాదశి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి మూల విగ్రహానికి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం వేదమంత్రాల మధ్య నిర్వహించారు. అలంకరణ స్వామి అష్టోత్తర శతనామార్చనలు, ధూప దీప నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు.
KMR: యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బీర్కుర్లో చోటుచేసుకుంది. మండలానికి చెందిన హరీశ్ (19) వారి పాత ఇంట్లో నిద్రించాడు. మంగళవారం ఉదయం అతడి తండ్రి తలుపు తెరిచి చూసేసరికి ఉరేసుకొని కనిపించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు.
NGKL: కల్వకుర్తి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మంగళవారం సాయంత్రం సేవా కేంద్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లా న్యాయమూర్తి రాజేష్ బాబు ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడిషియల్ ఈ-కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 29 ఈ-సేవా జ్యుడిషియల్ కేంద్రాలు ప్రారంభమయ్యాయని న్యాయమూర్తి వివరించారు.