KMM: ఈనెల 28న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని ఇల్లందు మండలం బొంబాయి తండాలో బుధవారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. సబ్ డివిజన్ కార్యదర్శి పొడుగు నరసింహారావు పాల్గొని సభ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు హర్జ్య, పాండ్యా, బిక్షం, మంగిలాల్, తేజ పాల్గొన్నారు.