KMM: మధిర మండలం బయ్యారం చర్చిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు బోధనలు ప్రేమ, మానవత్వానికి మార్గదర్శకమని, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పండుగ వేళ ప్రతీ ఇంట ఆనందం నిండాలని ఆకాంక్షించారు.