JGL: హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మార్గశిర మాసం కృష్ణపక్షం ఏకాదశి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి మూల విగ్రహానికి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం వేదమంత్రాల మధ్య నిర్వహించారు. అలంకరణ స్వామి అష్టోత్తర శతనామార్చనలు, ధూప దీప నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు.