• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రామప్ప-లక్నవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు

MLG: రామప్ప నుంచి లక్నవరం చెరువులోకి నీటిని తరలించే ప్రాజెక్టు విషయంలో అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క అన్నారు. ములుగు(D)లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తామని తెలిపారు. భూ సేకరణ ప్రతిపాదనలను 15రోజుల్లో సమర్పించాలని అధికారులకు సూచించారు.

March 4, 2026 / 02:42 PM IST

లైన్ మెన్ దినోత్సవం.. విద్యుత్ సిబ్బందికి సన్మానం

JGL: భీమారంలో ‘లైన్ మెన్ దినోత్సవం’ సందర్భంగా విద్యుత్ శాఖ లైన్‌మెన్లను సర్పంచ్ స్వాతి సంజీవ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిలో విద్యుత్ సిబ్బంది పాత్ర కీలకమని, ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో వారు చూపుతున్న అంకితభావాన్ని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

March 4, 2026 / 02:36 PM IST

నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో హోలీ సంబరాలు

NLG: నల్గొండలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. SI సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మనగుడి జనార్ధన్, ప్రధాన కార్యదర్శి తరాల పరమేష్, స్థానిక ప్రముఖులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరూ పరస్పరం రంగులు చల్లుకుంటూ హర్షాతిరేకంగా శుభాకాంక్షలు తెలియజేసి ఐక్యతను ప్రదర్శించారు.

March 4, 2026 / 02:34 PM IST

కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

WGL: కొమ్మాల జాతర సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గం తన అడ్డా అని, వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె సుస్మిత పటేల్ పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. సుస్మిత తనకంటే ధైర్యవంతురాలని, కార్యకర్తలకు సమస్య వస్తే ఎంతటివారినైనా ఎదుర్కొంటుందని భరోసా ఇచ్చారు.

March 4, 2026 / 02:33 PM IST

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక షెడ్యూల్

GDWL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గద్వాల కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా తెలిపారు. 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న గ్రామ, 16న మండల, మే 2న నియోజకవర్గ, మే 22న జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించి, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుతామని చెప్పారు.

March 4, 2026 / 02:32 PM IST

ట్రాన్స్‌ఫార్మర్‌లు కాపాడేందుకు పకడ్బందీ చర్యలు: SE

PDPL: వర్షాకాలంలో పిడుగులు, మెరుపుల నుంచి విద్యుత్తు లైన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లను కాపాడేందుకు పెద్దపల్లి సర్కిల్లో పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఎస్ఈ గంగాధర్ తెలిపారు. కీలక ప్రాంతాల్లో 122 లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేశామని, అధిక వోల్టేజ్‌ను భూమిలోకి మళ్లించి బ్రేక్ డౌన్‌లను నివారిస్తాయని పేర్కొన్నారు. తద్వారా అంతరాయం లేని విద్యుత్ అందుతుందన్నారు.

March 4, 2026 / 02:32 PM IST

రైలు ప్రయాణికురాలికి ‘108′ అండ

WGL: హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న పింకీ సహా అనే మహిళ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆమె పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది కాజీపేట రైల్వే స్టేషన్‌కు వెంటనే చేరుకుని ఈఏంటి చైతన్య, పైలట్ కుమారస్వామి తక్షణమే స్పందించి ఆమెకు అత్యవసర చికిత్స అందించారు.

March 4, 2026 / 02:32 PM IST

‘రైతు భరోసా నిధులు విడుదల చేయాలి’

MHBD: యాసంగి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని CPI స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుధాకర్ రెడ్డి అన్నారు. కురవిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మార్క్ ఫెడ్ సంస్థతో మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తూ రైతు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

March 4, 2026 / 02:31 PM IST

ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

JGL: వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేట గ్రామంలోని నాగపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీస్సులు పొందారు.

March 4, 2026 / 02:30 PM IST

బోనకల్ పీహెచ్సీలో అపరిశుభ్రత.. రోగుల అవస్థలు

KMM: బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఆసుపత్రి ప్రాంగణంలో పిచ్చిమొక్కలు, ఎండిన ఆకులు కుప్పలుగా పడి ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య సూత్రాలు చెప్పాల్సిన చోటే అపరిశుభ్రత రాజ్యమేలడంపై ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే వ్యర్థాలను తొలగించి ప్రాంగణాన్ని శుద్ధి చేయాలని కోరారు.

March 4, 2026 / 02:30 PM IST

వైద్య విద్యార్థుల హోలీ వేడుకలు

WGL: కేఎంసీ ఆవరణ బుధవారం రంగుల మయమైంది. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా పండుగకు దూరంగా ఉన్న భావి వైద్యులు, ఈరోజు ఉదయాన్నే హోలీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కళాశాల మైదానంలో విద్యార్థులంతా ఒక్కచోట చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చదువుల ఒత్తిడిని పక్కన పెట్టి, డీజే పాటలతో సంబరాలు జరుపుకున్నారు.

March 4, 2026 / 02:28 PM IST

MPPS పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

NRPT: కంసాన్పల్లి ఎంపీపీఎస్ పాఠశాలను ఎంఈవో కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల రిజిస్టర్, విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. 3,4 తరగతుల ఎఫ్‌ఎల్‌ఎస్ మాక్ టెస్టును సమీక్షించి బోధన విధానాన్ని చూశారు. విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం సునీతతో, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 4, 2026 / 02:28 PM IST

రహదారిపై డ్రైనేజీ నీరు స్థానికులకు ఇబ్బంది

KMM: మధిర మున్సిపాలిటీ మడుపల్లి ప్రధాన రహదారిపై డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుకున్నట్లు బుధవారం వెల్లడించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై మురుగునీరు చేరడంతో దుర్వాసన వెదజల్లుతోంది. వాహనాలు జారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.

March 4, 2026 / 02:27 PM IST

అడవి లింగాలలో సీసీ రోడ్డు ప్రారంభం

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో గల అడవి లింగాల గ్రామంలోని SC వార్డులో రూ.5లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. గ్రామ అభివృద్ధికి మరిన్ని పనులు చేపడతామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, సెక్రటరీ శంకరయ్య పాల్గొన్నారు. 

March 4, 2026 / 02:26 PM IST

ఇంటర్ విద్యార్థిపై పోక్సో కేసు నమోదు

NGKL: జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న బాలిక ప్రసవం ఘటనలో నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వనపర్తి జిల్లాకు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడితో సదరు విద్యార్థినికి పరిచయం ఉందని, ఆ చనువుతోనే ఆమె గర్భం దాల్చినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితురాలు మైనర్ కావడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

March 4, 2026 / 02:20 PM IST