• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రూ. 15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

RR: కొందుర్గు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. రాబోవు మూడు సంవత్సరాల్లో మండలం రూపురేఖలు మారబోతున్నాయని, మండల కేంద్రంలో రూ. 15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొందుర్గు మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు.

February 21, 2026 / 07:41 PM IST

‘అభ్యుదయ సాహిత్యాన్ని కాపాడుకోవాలి’

NLG: ఫిబ్రవరి 21న ‘రెడ్ బుక్ డే’ సందర్భంగా నల్గొండ సుందరయ్య భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో అధ్యయన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 1848లో ఇదే రోజున వెలువడిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’ స్మరణార్థం ఈ దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సామాజిక మార్పు, సమానత్వం కోసం రాసిన అభ్యుదయ సాహిత్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.

February 21, 2026 / 07:41 PM IST

గోల్డ్ మెడల్స్ కోసం విరాళం అందజేత

MBNR: పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జంగం విశ్వనాథ్ తన ఉదారతను చాటుకున్నారు. సైకాలజీ విభాగంలో మెరిట్ సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించేందుకు రూ.3 లక్షల చెక్కును వీసీ ప్రొ. కె. శ్రీనివాస్‌కు అందజేశారు. గత ఏడాది కూడా ఆయన అభ్యర్థుల కోసం రూ.3.5 లక్షల విలువైన పుస్తకాలను విరాళంగా ఇచ్చి అండగా నిలిచారు.

February 21, 2026 / 07:35 PM IST

సిద్దేశ్వర ఆలయం హుండీ లెక్కింపు

SRD: కంగ్టి గ్రామ శివారులోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఆలయ ఈవో శివ రుద్రప్ప పర్యవేక్షణలో అర్చకులు స్థానికులు కలిసి హుండీని లెక్కించారు. గత ఐదు నెలల నుంచి హుండీ ద్వారా రూ. 72,525 ఆదాయం వచ్చినట్లు EO శివ రుద్రప్ప తెలిపారు. వచ్చిన ఆదాయంతో ఆలయ అభివృద్ధికి నిధులు ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. ఇందులో సర్పంచ్ కృష్ణ ముదిరాజ్, సంగమేశ్వర్ ఉన్నారు.

February 21, 2026 / 07:35 PM IST

ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా కమిటీ రద్దు

SRPT: కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇంఛార్జ్ వెంకటేశ్వర్లు మాదిగ జిల్లా కమిటీని రద్దు చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనలో ఉద్యమానికి జిల్లా కమిటీ నిర్లక్ష్యం వహించిందని ఆయన ఆరోపించారు.

February 21, 2026 / 07:33 PM IST

జాతీయస్థాయికి తూప్రాన్ విద్యార్థి ప్రాజెక్టు

MDK: తూప్రాన్‌లోని గీతా స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి మహతి తయారు చేసిన ‘వ్యర్ధాల నిర్వహణ- ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం’ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. కామారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో దక్షిణ భారత స్థాయితోపాటు, జాతీయస్థాయికి ఎంపికైంది. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రాజెక్టులు ఎంపిక కాగా, జిల్లాకు చెందిన నాలుగు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.

February 21, 2026 / 07:32 PM IST

రిమ్స్ SNCU విభాగానికి జాతీయ స్థాయి గుర్తింపు: కలెక్టర్

ADB: పుదుచ్చేరిలోని ప్రతిష్టాత్మక జిప్మర్ సంస్థ నిర్వహించిన వర్క్‌షాప్‌లో రిమ్స్ ఆసుపత్రిలోని SNCU విభాగానికి జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు రూ. 5 వేల రివార్డు సాధించడం జరిగిందని కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. శిశు ఆరోగ్య విభాగంలో ఇన్ఫెక్షన్ల రేటును గణనీయంగా తగ్గించడంలో మంచి ఫలితాలను సాధించాలని కొనియాడారు. ఈ మేరకు సిబ్బందిని ఆయన అభినందించారు.

February 21, 2026 / 07:32 PM IST

ముగిసిన వార్డ్ సభ్యుల శిక్షణ

NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణ తరగతులు శనివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఎంపీవో గోవర్ధన్ మాట్లాడుతూ.. గత ఐదు రోజుల నుంచి నేర్చుకున్న అంశాలను వార్డు సభ్యులు ఆయా వార్డులలో ఆచరణలో పెట్టి గ్రామాభివృద్ధికి సహకరించాలని అన్నారు. అనంతరం శిక్షణ సర్టిఫికెట్లను వార్డు సభ్యులకు అందజేశారు.

February 21, 2026 / 07:31 PM IST

మరో వారం రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం

MNCL: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఊరు రామకృష్ణాపూర్, RK-1, సుభాష్ నగర్ ఏరియాల్లో గత 15 రోజులుగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన పైపులైన్లు పగిలిపోవడంతో మరమ్మతు పనుల్లో జాప్యం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ రాయలింగు శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని, మరో వారం రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

February 21, 2026 / 07:31 PM IST

‘అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం’

NZB: అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయ్ బాబు స్పష్టం చేశారు. శనివారం సాలూర పరివాహక ప్రాంతంలో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఒక టారస్ లారీని పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనాన్ని బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయానికి తరలించినట్లు సీఐ వెల్లడించారు.

February 21, 2026 / 07:30 PM IST

విద్యుత్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్

KMM: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కారేపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న శ్రీకాంత్, సురేష్, యాదగిరిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు CI సాగర్ తెలిపారు. నిందితుల నుంచి సుమారు 100 కేజీల కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నారు.

February 21, 2026 / 07:30 PM IST

పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్

WGL: నల్లబెల్లి మండలం మేడపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, సేవల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

February 21, 2026 / 07:30 PM IST

రేపు జిల్లాకు వర్ష సూచన

ASF: జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోతకు సిద్ధంగా ఉన్న పత్తిని రైతులు రాబోయే రెండు రోజుల్లోనే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచించారు. పంట నష్టం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

February 21, 2026 / 07:29 PM IST

అక్రమ ఇసుక రవాణా.. ఏడుగురిపై కేసు

KNR: బొమ్మకల్ సమీపంలోని రాజీవ్ రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడుగురిని విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన నిందితులపై ఇన్స్‌పెక్టర్ వరుణ్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేశారు. 7 ట్రాక్టర్లను సీజ్ చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

February 21, 2026 / 07:27 PM IST

దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్: సీఎం

VKB: దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 140 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ పటిష్ఠతకు పని చేయాలని సూచించారు.

February 21, 2026 / 07:26 PM IST