VKB: తాండూర్ నుంచి హైదరాబాద్కు 110 కిలోమీటర్లు బస్సు ఛార్జ్ రూ.160 అదే రైలు ఎక్స్ప్రెస్ ఛార్జ్ రూ. 55 ఉంది. బస్సులో వెళ్లే వారికి తీవ్రంగా కాలయాపన జరుగుతుండగా అదే రైల్లో వెళ్లే వారికి అతి తక్కువ సమయంలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. రైలు ఛార్జ్ కేవలం రూ. 55 ఉండి ఉండగా బస్సు ఛార్జీ రూ.160 ఉండటంతో ఉన్నతాధికారులు ఆలోచించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
BHPL: మహదేవపూర్(M)దుబ్బగూడెంలో సోమవారం రాత్రి భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక రైతు పోత సమ్మయ్య ఇంట్లో గుర్తు తెలియని చొరబడి బీరువా తెరిచి 30 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును అపహరించుకెళ్లారు. కూతురి వివాహం కోసం ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన సొమ్మును కోల్పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన 14వ వార్డు కౌన్సిలర్ బొల్లారపు స్వప్న గిరిధర్, డీఎస్పీ రఘుచంధర్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశం జగిత్యాల పట్టణంలో జరిగింది. ఈ కలయికలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు.
SDPT: జగదేవ్ పూర్ మండలం అలీరాజ్పేటలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి తిరుపతి, వ్యవసాయ అధికారి వసంతరావు, యువరైతు శ్రీనాథ్ రైతులకు ప్రకృతి సేద్యంలోని మెళకువలను వివరించారు. రసాయన రహిత సాగుతో భూసారం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు.
BDK: అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ కారం శివ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది. శ్రీ భవాని కంటి ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు చూపు సమస్యలు, మసక చూపు, కంటి నొప్పులు వంటి సమస్యలను పరీక్షించి తగిన సూచనలు ఇచ్చారు.
HYD: ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. ఆందోళనలకు దూరంగా సంస్థ పురోగతి, కార్మిక సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాల కోసం కలిసి పనిచేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
HNK: పట్టణ కేంద్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత క్యాంపస్లో రూ.137.77 కోట్లతో మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతుండగా..మరో రూ.618.79 కోట్లతో ఆధునిక సౌకర్యాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. 2047 నాటికి విద్యార్థుల సంఖ్యను రెండింతలు చేయాలనే లక్ష్యంతో రెండో క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి.
NLG: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చిట్యాల – శ్రీరామ్ నగర్ స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్-30 ని తాత్కాలికంగా మూసివేశారు. కి.మీ. 53/5-6 వద్ద ఉన్న ఈ గేటును ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం ఈరోజు నుంచి బుధవారం సా. వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ఇతర మార్గాలను చూసుకోవాలని సూచించారు.
PDPL:ఎ లిగేడు మండలం శివపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు 28 లబ్ధిదారులకు రూ.28,03,248 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకాన్ని 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. గ్రామ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు. ఫ్రీ బస్సు, రైతు బోనస్, వైద్య సాయం, ఇందిరా ఇళ్లు, రేషన్ కార్డులు వంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.
NZB: ధర్పల్లి ఎంపీపీ కార్యాలయంలో 10 గ్రామాలకు చెందిన 96 మంది వార్డు సభ్యులకు మంగళవారం రెండవ విడత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రామీణ పరిపాలన వ్యవహారాలు, సభ్యుల బాధ్యతలపై ఐదు రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు. వార్డు సభ్యులు తమ బాధ్యతలను తెలుసుకుని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
WGL: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా జరుగడానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మంగళవారం తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు కంటే ఎక్కువ వ్యక్తులు చేరకూడదన్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు నిషేధమని వెల్లడించారు.
VKB: మోమిన్పేట్ మండలం అమ్రాదికలాన్లో శనివారం గుర్తుతెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. ఈమేరకు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని మండలంలోని అంబేద్కర్ సంఘాలు ఇవాళ మండి పడ్డాయి. లేని పక్షంలో మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
KMM: జిల్లాలో నేరాల తీరు మారుతోంది. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాల కోసం ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు కిరాయి ముఠాలను ఆశ్రయించడం ఆందోళన కలిగిస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేయాలని రూ. లక్షల సుపారీలు ఇస్తున్నా, పోలీసులు సాంకేతికతతో నిందితులను పసిగడుతున్నారు. ఇటీవలి యూట్యూబర్ హత్య ఇందుకు నిదర్శనం.
SRCL: నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టు న్యాయవాది జి.కళ్యాణిపై దాడికి నిరసనగా వేములవాడలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులు బహిష్కరించారు. మహిళా న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్య నారాయణరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పత్తి కొనుగోళ్లకు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రకటించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియకు గడువును పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.