SDPT: ప్రభుత్వం నియమించిన విద్యా కమిటీలో నిజమైన విద్యా వేత్తలు ఎందరున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ‘X’ వేదికగా ప్రశ్నించారు. కమిటీ ఛైర్మన్గా ఒక ఇంజినీర్, సభ్యులుగా మాజీ ఐఏఎస్ అధికారులను నియమించారని, పాఠ్యాంశాల రూపకల్పనలో నైపుణ్యం ఉన్న ఒక్క సభ్యుడైనా ఉన్నారా అని నిలదీశారు.
JGL: సీఎం కప్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభినందించారు. జగిత్యాలకు చెందిన హర్షిత్, కృష్ణ గోల్డ్ మెడల్, అక్షయ్ సిల్వర్ మెడల్, కనిష్క్ బ్రాంజ్ మెడల్ సాధించగా, ఎమ్మెల్యే వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. డీవైఎస్వో రవికుమార్, సమిండ్ల శ్రీనివాస్, రాజారెడ్డి, లు అభినందించారు.
NGKL: కుమ్మెర ఘటన నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం సమర్పించారు. జాతర ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్న సర్పంచ్ తుకారం రెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలోని ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయాలని కోరారు.
ADB: గిరిజన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. నిన్న రాత్రి పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
MDK: జిల్లాలో గత 9 నెలల్లో వివిధ రంగాలకు రూ.4,611 కోట్ల రుణాలను పంపిణీ చేసి, వార్షిక లక్ష్యంలో 67.32 శాతం పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతులకు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో పెద్దపీట వేశామన్నారు.
MBNR: జిల్లాలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదని, ప్రతి పౌరుడు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన అవసరమని పేర్కొన్నారు.
KNR: జమ్మికుంట రైతు ప్రగతి ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘంకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం “కో ఆపరేటివ్ ఎక్సలెన్స్ & మెరిట్-2025” అవార్డు లభించింది. దీనిని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ అవార్డును హైదరాబాద్ లోని టెస్కాబ్లో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ చేతుల మీదుగా FPO ప్రెసిడెంట్ మహేందర్ స్వీకరించారు.
WGL: ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
JN: ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాన్ని(EHS) ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, డీఏలను తక్షణమే చెల్లించాలని కోరారు. పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు.
HNK: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధ్యక్షతన శుక్రవారం సివిల్ సప్లైస్ విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తరచుగా దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ విభాగం క్షేత్రస్థాయిలో నిఘా పెంచాలని సూచించారు. సమావేశంలో అ.కలెక్టర్ రవి, DCSO వాజిద్ అలీ, కమిటీ సభ్యురాలు అనిత రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
WGL: కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ప్రమాదాల తగ్గింపు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ప్రమాదాల ప్రదేశాలను గుర్తించి హచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, AJC సంధ్యారాణి పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది.
ADB: మహిళా సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారై అన్ని రకాల విధుల్లో సమర్థంగా పాల్గొనాలని SP అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో 3 రోజుల పాటు నిర్వహించిన మహిళా సిబ్బంది మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క విధులకు పూర్తి సంసిద్ధతతో ఉండాలని కోరారు.
VKB: మే 10 నుంచి జూన్ 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జనగణన సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో తమకు సూపర్వైజర్లుగా విధులు కేటాయించాలని కుల్కచర్ల తహాశీల్దార్ మనోహర్ చక్రవర్తికి శుక్రవారం PSHMA జిల్లా అధ్యక్షుడు తుప్పలి ఆనంద్ కుమార్ నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నరేష్, వీరేశం, తౌర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.