వనపర్తి: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2024లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పక్కా సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. బాధితురాలికి న్యాయం జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు సంఘంలో మంచి సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు.
SRPT: నడిగూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ నిధులతో ప్రీ-ప్రైమరీ విభాగం సరికొత్తగా ముస్తాబవుతోంది. చిన్నారులను ఆకట్టుకునేలా తరగతి గది గోడలపై అక్షరాలు, అంకెలు, పక్షులు, జంతువుల చిత్రాలను ఆకర్షణీయంగా చిత్రీకరిస్తున్నారు. ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతాయని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
VKB: ఇంటర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తొలిరోజు తడబాటుకు గురయ్యారు. తాండూరు పట్టణంలో ముగ్గురు విద్యార్థులు హడావుడిలో పొరపాటున వేరే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ బలరాం, మరో వ్యక్తి వారిని తమ బైకుపై ఎక్కించుకుని వారి పరీక్షా కేంద్రానికి సమయానికి చేర్చారు.
MHBD: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎస్సై గిరిధర్ రెడ్డి సూచించారు. బుధవారం రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా గూడూరు మండలంలో వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు సరైన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్ ఉండాలని, హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
SRD: ఖేడ్ నియోజకవర్గంలో ప్రయాణికుల సౌకర్యాలు, అభిప్రాయాలు సూచనలు తెలుసుకునేందుకుగాను రేపు డయల్ యువర్ DM నిర్వహిస్తున్నట్లు ఖేడ్ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26 గురువారం ఉదయం 11:00 నుంచి 12:00 వరకు డయల్ యువర్ DM కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు బస్సు సమస్యల సూచనలు ఇచ్చేందుకు DM నెంబర్ 9959223170కు కాల్ చేయాలని కోరారు.
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్స పద్ధతిలో తొలిసారి ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, నేడు వారిని డిశ్చార్జ్ చేస్తున్నామని వైద్యులు తెలిపారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు మరియు ప్రోత్సహించేందుకు హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య ఉచితంగా పెన్నులు అందించారు. సమయాన్ని వృథా చేయకుండా, ఏకాగ్రతతో చదివి, మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.
NLG: పట్టణంలోని ప్రగతి కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించే పరీక్షల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.పరీక్ష కేంద్రాల వద్ద BNS సెక్షన్ 163 (144 సెక్షన్) అమల్లో ఉంటుందని, కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా తిరగడం నిషేధమని హెచ్చరించారు.
KMR: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. మద్నూర్ కేంద్రానికి అశ్విని అనే విద్యార్థిని నిర్ణీత సమయం కంటే కొంత ఆలస్యంగా చేరుకుంది. అధికారులు నిబంధనల మేరకు ఆమెను లోపలికి అనుమతించకపోవడంతో పరీక్ష రాయలేకపోయింది.విద్యార్థిని కన్నీటి పర్యంతమవుతూ అక్కడి నుంచి వెనుదిరిగింది.
దేవరకొండ: పట్టణంలోని 3వ వార్డు కౌన్సిలర్ అంకురి సుమలత వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వార్డులో పేరుకుపోయిన మురికి కాలువలను స్వయంగా పర్యవేక్షించి పూడిక తీయించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల వ్యాప్తి చెందకుండా మురుగు నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఇన్ఛార్జి DMHO డా.రవీందర్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై పలు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించి తెలుసుకున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే సాధారణ కాన్పులే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. చిన్నపిల్లలకు టీకాల వివరాలను ఆన్లైన్ చేయాలన్నారు.
BDK: మణుగూరు కట్టు మల్లారం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పోడు భూమి సమస్యపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫారెస్ట్ అధికారులను క్యాంపు కార్యాలయానికి పిలిపించి సమస్యను సమగ్రంగా చర్చించారు. గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
NRPT: కోస్గి మండలంలోని ముశ్రీఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు ఉపాధ్యాయులతో వివరించారు. పాఠశాల GHMగా పవన్, కలెక్టర్గా శివరాం, విద్యాశాఖ మంత్రి ముస్థాక్, వివరించినట్లు పాఠశాల GHM శేఖరయ్య తెలిపారు. ఉత్తమ విద్యా బోధన చేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. తోటి విద్యార్థులకు విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలను బోధించారు.
ASF: పెంచికల్ పేట్ మండలం ఎలుకపల్లికి చెందిన నాగేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జేసీబీ తవ్విన మట్టి దిబ్బల సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న SI అనిల్ కుమార్ బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
JGL: ధర్మపురి మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్గా వేముల నాగలక్ష్మి పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రజల సహకారంతో పారదర్శక పాలన అందిస్తానని ఛైర్ పర్సన్ హామీ ఇచ్చారు.