HNK: ఆత్మకూరు మండలం తిరుమలగిరి సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండి తల్లిదండ్రులకు సూచనలు చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు.
NGKL: జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి జాతర సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆదివారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దకొత్తపల్లి ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్ పోలీసులు మోహరించారు.
MHBD: తొర్రూర్ పట్టణ కేంద్రంలోని వికాస్ కళాశాలలో మేర యువ భారత్ వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం సి.వి. రామన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోఆర్డినేటర్ నవిన్ యాదవ్ మాట్లాడుతూ.. సి.వి. రామన్ ఆవిష్కరణలతోనే ప్రపంచం ముందుకు సాగుతోందని, యువత కూడా కొత్త ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కావాలని, నిరంతరం ఆవిష్కరణ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ADB: తెలంగాణ విద్యావిధానం-2026 నివేదికలో విద్య కమిషన్ తమ పరిధి దాటి ఉపాధ్యాయుల వేతనాలు, ప్రమోషన్లు, నియామకాల గురించి మాట్లాడడం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని PRTU తెలంగాణ సంఘం జిల్లాధ్యక్షుడు ఆడే నూర్ సింగ్ నాయక్ అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయులను గౌరవించాలని పేర్కొన్నారు.
JGL: విద్యార్థులు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుట్ల ఎస్సై చిరంజీవి అన్నారు. పట్టణంలోని కేరళ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులు పలు అంశాలపై చెపట్టిన ప్రాజెక్టులను ఎస్సై సందర్శించారు. ఈ సందర్బంగా ఎస్సై మట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
HYD: గ్రేటర్ పౌరుల ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు దిగింది. ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (PTP) కార్యక్రమాన్ని వచ్చే మార్చి నెలలో ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.
MLG: మేడారం మహా జాతర విజయవంతానికి అందరూ పట్టుదలతో కృషి చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ సాయంత్రం మేడారంలో జాతర అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో 251 కోట్లతో చేపట్టిన పనుల్లో 95% పూర్తయ్యాయని, మిగిలిన 5% పనులను త్వరలో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
MHBD: జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో హ్యూమన్ రైట్స్ కోసం నిరంతరం సేవలు అందిస్తున్న సంస్థ, టీం సభ్యులు, బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేస్తున్న వారి సేవలు మరవలేనివని అన్నారు.
JN: సాగరం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గాద ఇన్నయ్య తండ్రి సాల్మన్ రెడ్డి మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, సుదర్శన్ రెడ్డి, రమేష్, తదితరులు ఉన్నారు.
HYD: ఆటోలో దాచిన బంగారం చోరీకి గురైన ఘటన హుస్సేనీ ఆలం పీఎస్ పరిధిలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. శనివారం మక్కా మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు ఓ వ్యక్తి ఆటోలో వచ్చాడు. ఆటోలో బంగారం దాచి, పార్కింగ్ ఏరియాలో ఆటోను పార్కు చేశారు. అనంతరం వచ్చి చూడగా బంగారం మాయమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ASF: కుమ్మేర గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్ వద్ద వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పసిపాప మృతి ఘటనకు కారణమైన అగ్రవర్ణ నాయకులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
RR: కొత్తూరు పోలీస్ స్టేషన్ను ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ప్రాంగణం, రికార్డ్ రూమ్, స్టేషన్ రైటర్ రూమ్, రిసెప్షన్ సెంటర్ వంటి విభాగాలను పరిశీలించారు. వాటిని చక్కగా నిర్వహించుకోవాలన్నారు. నేరాల రేటు, రోడ్డు ప్రమాదాలు, చోరీ కేసులు, నమోదైన కేసుల పురోగతిపై ఆరా తీశారు.
MBNR: మహబూబ్ నగర్ రీజియన్ పరిధిలో 10 RTC డిపోల గ్యారేజ్, వివిధ విభాగాల్లో అప్రెంటిషిప్ శిక్షణ ప్రతిపాదికన పనిచేయుటకు ఇంజనీరింగ్, డిప్లమా, పట్టభద్రులు, నాన్ ఇంజనీరింగ్ పట్టభద్రులు BA, BSC, BCOMలో 2021 తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు nttp:nats.education.gov.in వెబ్సైట్లో మార్చి 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు.
ADB: పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,928 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, ఇందుకోసం 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
KMM: ఖమ్మం జిల్లా మంత్రులు, కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగించిన యూట్యూబ్ రిపోర్టర్ రఘుపై చర్యలు తీసుకోవాలని DCCB మాజీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం మధిర టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్కు లిఖితపూర్వకంగా నాయకులు ఫిర్యాదు చేశారు. వర్గ విభేదాలు సృష్టించిన జర్నలిస్టుపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.