BDK: దమ్మపేట లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలలో నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఏ తరగతి చదువుతున్నారు భవిష్యత్తులో ఏమవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారో తెలుసుకున్నారు. కొంతమందిని పాఠాలు చదివిస్తూ వారి పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు.
GDWL: తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని మైనారిటీ యువతులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఉచిత టైలరింగ్ శిక్షణ అందించనున్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి నుషిత తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ వరకు జిల్లా కలెక్టరేట్లోని మైనారిటీ శాఖ కార్యాలయం (రూమ్ F-8) వద్ద దరఖాస్తులు సమర్పించాలి.
NLG: నార్కట్ పల్లిలోని నల్గొండ చౌరస్తా వద్ద భారీ వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఇవాళ జిగ్ జాగ్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల క్రాస్ రోడ్డు వద్ద ఓ వాహనం షాపులోకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై విష్ణుమూర్తి ఈ చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు వేగ పరిమితిని పాటించాలని అధికారులు సూచించారు.
HYD: జలమండలి అన్ని కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో జేఎండీ మయాంక్ మిట్టల్తో కలిసి ఈ- ఆఫీస్ను ప్రారంభించారు. ఈయన మాట్లాడుతూ.. ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని, అలాగే పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు.
JN: జిల్లాలోని చేనేత కళాకారులు, డిజైనర్లు, మార్కెట్లలో ప్రతిభను గుర్తించి గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం – 2025లో భాగంగా ‘సంత్ కబీర్’ కాగా ‘జాతీయ చేనేత’ అవార్డుల కోసం ఔత్సాహికుల నుంచి జిల్లా చేనేత శాఖ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల వారు ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
NRML: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల చివరి రోజు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు కుటుంబ సభ్యులు కలిశారు. MLA తల్లిదండ్రులు గిరిజ బాయ్, భీమ్ రావు, సతీమణి ద్రుపద, కుమారులు తనీష్ పటేల్, నితీష్ పటేల్, సోదరులు రోషన్, నందులు రాహుల్ గాంధీని కలిశారు. MLA కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ ఆప్యాయంగా పలకరించారు.
నల్గొండలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయంపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు టూ టౌన్ ఎస్సై సైదులు స్థానిక పాన్ షాపుల యాజమాన్యాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మైనర్లకు పొగాకు విక్రయిస్తే కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే పాఠశాలలు, కళాశాలల 100 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను మూసివేయాలని సూచించారు.
BDK: గ్రామ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అంశాలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు నాయకులు వివరించారు. మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం గ్రామ పంచాయతీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లును కలిశారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
SRCL: పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంగన్వాడీ, గ్రామపంచాయతీ, హెల్త్ సబ్ సెంటర్స్ తుది దశ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, 15 ఆర్థిక సంఘం నిధులు, ఎన్ హెచ్ ఎం, డీఎంఎఫ్టీ ఇతర నిధులతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, పూర్తిచేయాలన్నారు.
KMR: జిల్లావ్యాప్తంగా నేడు జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్ష ముగిసింది. మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో 10,581 మంది విద్యార్థులకు గాను 10,173 మంది హాజరయ్యారు. 408 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, జిల్లాలో సగటు హాజరు శాతం 96.14గా నమోదైందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా, మౌలిక వసతులు కల్పించినట్లు వారు తెలిపారు.
PDPL: 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్కుమార్ ఇవాళ తెలిపారు. 6వ తరగతిలో పూర్తి సీట్లు, 7 నుంచి 10 తరగతులకు మిగిలిన సీట్లకు ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.
KNR: క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని హుజురాబాద్ ఏసీపీ వి.మాధవి సూచించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో సోమవారం పీఎం సంసద్ క్రీడా మహోత్సవంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి క్రీడలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రీడలో రాణించాలని ACP కోరారు.
BHNG: మండలలోని కేంద్రమైన దూది వెంకటాపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
WNP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సోమవారం వనపర్తి జిల్లాలో మహిళా సంఘాల సభ్యులతో సమీక్షించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని మాట్లాడుతూ సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.
JGL: మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ పదవీ విరమణతో, జగిత్యాల మున్సిపల్ కమిషనర్గా ఉన్న స్పందనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం స్పందన మెట్పల్లి మున్సిపల్ కమిషనర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.