SRPT: రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఏర్పాటు చేస్తున్న పలు పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. మొత్తం పట్టణంలో 11 పరీక్షా కేంద్రాల్లో 1,485 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలియజేశారు.