WGL: నర్సంపేట పట్టణానికి చెందిన గందె లావణ్య-రాజిరెడ్డి ఇంటి ఆవరణలో 90 రోజుల వ్యవధిలో 12 బ్రహ్మ కమలాలు వికసించి అరుదైన దృశ్యం కనువిందు చేసింది. రాత్రి విరబూసి, తెల్లవారుజామున మూసుకుపోయే ఈ పుష్పాలు ఆధ్యాత్మిక చిహ్నంగా భావిస్తారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ఇవాళ స్థానికులు తరలివచ్చారు. లావణ్య-రాజిరెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.