BHPL: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే కోరారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీల పేరుతో, డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్, వివిధ రకాల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ఆశచూపి మోసం చేస్తున్నారని, మొబైల్కి వచ్చే OTP చెప్పవద్దని సూచించారు.