JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం బ్రహ్మపుష్కరిణిలో ఉగ్రనరసింహస్వామి ఉత్సవమూర్తులను కోనేరుకు తీసుకువచ్చారు. ఆలయ అర్చక సిబ్బందిహంసవాహనంపై ఆశీనులను గావించి పుష్కరిణిలో ఐదు ప్రదక్షిణలు చేయిస్తూ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పుష్కరిణి మండపంలో డోలోత్సవం నిర్వహించారు.