WGL: రాయపర్తి మండలంలోని పలువురు లబ్ధిదారులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 45 మంది లబ్ధిదారులకు రూ. 45,00,720 విలువగల చెక్కులను ఆమె మండల కేంద్రంలోని రైతు వేదికలో అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.