KMR: బైక్ డిక్కీలోంచి నగదు చోరీ అయిన ఘటన బాన్సువాడలో జరిగింది. తాడ్కోల్కు చెందిన రిటైర్డ్ MPDO సాయి రెడ్డికి చెందిన స్కూటీలోంచి ఓ దొంగ రూ.లక్ష చోరీ చేశాడు. ఆయన సోమవారం బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని వస్తూ కూరగాయలు కొనుగోలు చేయడానికి స్కూటీని పక్కన పార్కు చేశాడు. అతడిని ఫాలో చేసిన దొంగ నగదు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది.