W.G: నరసాపురం మండలం రుస్తుంబాద మురుకు కాల్వలపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మకు వైఎస్ పాలెం మాజీ సర్పంచ్ కూనపరెడ్డి రంగారావు వినతిపత్రం అందజేశారు. సోమవారం భీమవరంలో మంత్రిని కలిసి సమస్యను వివరించారు. ఆక్రమణలు తొలగించకపోవడంతో సుమారు 400ఎకరాలు ముంపు బారిన పడుతున్నాయన్నారు. సాగుకు రైతులు దూరమవుతున్నారన్నారు.