ప్రకాశం: గిద్దలూరు నూతన కమిషనర్గా ఈవీ రమణబాబును నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రమణబాబు గతంలో నందిగామ మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్గా విధులు నిర్వహించారు. నూతన కమిషనర్కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. గిద్దలూరు ప్రస్తుత మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు పిడుగురాళ్లకు బదిలీ అయ్యారు.