HYD: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సెల్ ఫోన్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్, సనత్ నగర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో దొంగిలించిన ఆరు మొబైల్ ఫోన్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించామని తెలిపారు.