ప్రకాశం: ఒంగోలులోని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం డిగ్రీ 4వ సెమిస్టర్ మూల్యాంకనం మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ కళ్యాణి తెలిపారు. డ్యూటీ ఆర్డర్లు పొందిన అధ్యాపకులు హాజరు కావాలన్నారు. తెలుగు, ఇంగ్లీష్ మినహా అన్ని సబ్జెక్టుల సమాధానపత్రాలు వచ్చినట్లు పేర్కొన్నారు. మూల్యాంకనానికి నియమితులైన వారు ఐడీ కార్డు, ప్రిన్సిపల్ సంతకంతో రిపోర్ట్ చేయాలన్నారు.