కోనసీమ: మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన మోటుపల్లి స్వామినాయుడు(36) సోమవారం బహిర్భూమికి వెళ్లి గోదావరిలో పడి మృతి చెందాడు. హైదరాబాద్లో టైలరింగ్ చేస్తూ జీవనోపాధి పొందే స్వామినాయుడు శనివారం స్వగ్రామం వచ్చాడని స్థానికులు తెలిపారు. వేసవి సెలవులకు స్వగ్రామం వచ్చిన అతనికి ప్రమాదం జరగటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.