NLR: కందుకూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8 తరగతి చదువుతున్న షోయబ్ అనే విద్యార్థి తన నిజాయితీ చాటుకున్నాడు. స్కూల్ నుంచి సైకిల్పై వస్తున్న అతనికి రైతు బజార్ ప్రాంతంలో ఓ చిన్న బాక్స్ దొరికింది. ఇంటికి వచ్చి చూస్తే అందులో సుమారు 10సవర్ల బంగారు(సుమారు రూ.7 లక్షలు) నగలు కనిపించాయి. బాధితులకు అందించాలన్న భావనతో షోయబ్ నిజాయితీగా కందుకూరు సీఐ వెంకటేశ్వరరావుకు అందజేశారు.