RR: బీఎన్ రెడ్డి డివిజన్ హరిహరపురం కాలనీలోని శ్రీ త్రిశక్తి దేవస్థానంలో మంగళవారం శుద్ధ షష్టి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కళ్యాణం వైభవంగా జరగనుందన్నారు. అనంతరం ప్రసాద వితరణ చేపడతారు. భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవాలయ కమిటీ కోరింది.