HYD: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు శుక్రవారం ఎల్లమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పుష్పాలు, కరెన్సీతో అందంగా అలంకరించారు. శ్రీ గజలక్ష్మి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.