గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ ఆగిపోయింది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో 4.5 ఓవర్ల తర్వాత ఆటను నిలిపివేశారు. ఆట నిలిపి వేసే సమయానికి భారత్ స్కోర్ 52/0గా ఉంది. అభిషేక్ (23*), గిల్ (29*) పరుగులతో ఉన్నారు.