VSP: జిల్లా విశ్రాంత న్యాయమూర్తి సలాది నరసింహారావు శనివారం విశాఖలోని లయన్స్ కాన్సర్, జనరల్ హాస్పిటల్ను సందర్శించారు. వారి తండ్రి సలాది గంగరాజు జ్ఞాపకార్థం హాస్పిటల్లోని అల్ట్రా సౌండ్, కలర్ డాప్లర్ గది ఆధునీకరణ కోసం రూ.1,50,000 విరాళం చెక్కు రూపంలో అందజేశారు. హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ ఉమామహేశ్వరరావుకు ఈ చెక్కును అందజేశారు.