KNR: ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వైద్యాధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఉందని, గ్రామీణ స్థాయిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.