KMM: అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న యుద్ధోన్మాదం, ప్రపంచ దేశాలపై ఆర్థిక దాడులకు నిరసనగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. మార్చి 23 జాతీయోద్యమ అమరవీరుల భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ అమరత్వం పొంది 95 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోమవారం ప్రదర్శన నిర్వహించారు.