MDK: అప్పుల బాధ తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలానికి చెందిన పంజ సత్తయ్య (48) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తనకున్న భూమిని అమ్మి ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. అనంతరం కొత్త ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో 5 లక్షలు, బయట వ్యక్తుల వద్ద 10 లక్షల అప్పు చేశాడు.