SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో 22వ రోజు కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు , జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుహాసినులకు వాయినంగా పసుపు, కుంకుమ, గాజులు, అందజేశారు.