NRML: జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షా 92 వేల 233 ఇళ్లకు దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సాయంత్రం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ను నియమించి రాబోయే 20 రోజులలో పూర్తిస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.