ADB: రూరల్ మండలంలోని ఖండాల, వాన్వాట్ గ్రామాల్లో PHC వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. జిల్లా వైద్యశాఖ అధికారి (DMHO) నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అంటు రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.