SRD: దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక అవసరాలను గుర్తించేందుకు మంగళవారం సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఆర్పీ ప్రకాష్ రావు తెలిపారు. గ్రామంలో భాగ్యేష్, సిద్ధంగిర్గాలో రేచల్ అనే దివ్యాంగ విద్యార్థులను గుర్తించి బడిలో పేర్లను నమోదు చేయించామని చెప్పారు. ఇందులో టీచర్లు రమేష్, వెంకట్ రాథోడ్ ఉన్నారు.