JN: పాలకుర్తి మండల కేంద్రంలో గొర్రెల, మేకల పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించాలని జీఎంపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గొర్రెల పంపిణీ, పెంపకందారులకు పెన్షన్లు, బీమా సౌకర్యం, అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.