SKLM: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అసత్యమని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి బుధవారం తెలిపారు. ప్రజలు ఇటువంటి వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.